కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం

భీమవరం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర విశాఖపట్నం జనవాణి కార్యక్రమానికి విచ్చేయగా ఆ కార్యక్రమం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అనేక ఇబ్బందులు గురి చేసిన కారణంగా మరియు జనసేన నాయకులను అక్రమంగా అరెస్టు చేసినందుకు గాను జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ కొటికలపూడి గోవిందరావు అధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు భీమవరం నియోజవర్గం జనసేన పార్టీ కార్యాలయం నుండి నిరసన తెలియజేస్తూ ప్రకాశం చౌక్ లో గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమములో రాష్ట్ర పిఏసి సభ్యులు కనకరాజు సూరి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉండి నాయకులు జుత్తుగ నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గవర లక్ష్మి, భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, సెక్రటరీ సుంకర రవి, భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, సెక్రెటరీ కత్తుల నిలెంద్ర, వీరవాసరం మండలం అధ్యక్షులు గుండా రామకృష్ణ, కాళ్ల మండల అధ్యక్షులు రాము, ఎంప్ప్ అడ్డాల రాము, ఎంపీటీసీలు గుల్లిపల్లి విజయలక్ష్మీ, తాతపూడి రాంబాబు, అరేటి వాసు, ఆకుల మౌనిక, మాజి కౌన్సిలర్ మగాపు ప్రసాద్, వానపల్లి సూరిబాబు, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు కార్తిక్, నియోజకవర్గం జనసేన నాయకులు బండి రమేష్, ఉండవల్లి శ్రీను, ఏడుకొండలు, పంతం ప్రసాద్, త్రివిక్రమ్, లోవరాజు, భాస్కరరావు, పుప్పాల బాలాజీ, పుప్పాల సుబ్బారావు, భీమవరం, ఉండి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.