మంగళగిరిలో జనసేన అత్యవసర సమావేశంలో పాల్గొన్న బత్తుల బలరామకృష్ణ
మంగళగిరి, మూడు రోజుల క్రితం విశాఖ పర్యటనకు విచ్చేసిన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం, జనసేన నాయకులను, జనసైనికులను అక్రమంగా అరెస్టు చేయడాలు తదితర పరిణామాల అనంతరం రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య అధినేత మంగళగిరి పార్టీ ఆఫీస్ చేరుకోవడం జరిగింది. అక్కడ నుండి రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు జనసైనికులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం. అక్కడి నుంచి బత్తుల బలరామకృష్ణకు పిలుపు రావడంతో సోమవారం రాత్రి అందుబాటులో ఉన్న జనసేన నాయకులు, జనసైనికులతో కార్ల ర్యాలీగా వెళ్లి రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు “బత్తుల బలరామకృష్ణ” సమావేశానికి హాజరై, జరిగిన పరిణామాలకు అధినేతకు సంఘీభావం తెలిపడం జరిగింది. వీరి వెంట నియోజకవర్గ సీనియర్ నేతలు, జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాబోవు రోజులు పార్టీ బలోపేతంపై, వైసీపీ గూండాగిరి ఎదుర్కోవడం పై అధినేత పవన్ కళ్యాణ్ గారు నాయకులకు, జనసైనికులకు దిశానిర్దేశం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-18-at-16.16.50-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-18-at-16.18.05-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-18-at-16.16.45-1024x768.jpeg)