జనంకోసం జనసేన 325వ రోజు
- వనరక్షణలో భాగంగా 500 మొక్కల పంపిణీ
జగ్గంపేట, జనంకోసం జనసేన 325వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం, గోకవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం 500 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 83295 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, ప్రగడ ప్రభ, గవిని దుర్గాప్రసాద్, ఉంగరాల శివాజీ, మహిపాల పాండు, కొత్తపల్లి గ్రామ అధ్యక్షులు సోలా అంజిబాబు, మిరియాల ఆనంద్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గాదెలపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన తుమ్మలపల్లి ప్రేమసాగర్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-19-at-20.50.48.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-19-at-20.50.51.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-19-at-20.50.50.jpeg)