పలు కుటుంబాలను పరామర్శించిన బండారు శ్రీనివాస్

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు గ్రామము దేవి కాలనిలో సింగంశెట్టి సత్తి పండు, గంగిరెడ్ల కాలనిలో దనకొండ నల్లయ్యలు ఇటీవల కాలం చేయగా పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలను కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంఛార్జి బండారు శ్రీనివాస్ బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గంగిరెడ్ల కాలనీ దనకొండ నల్లయ్య కుటుంబం పడుతున్న ఇబ్బందులు, వారి ఆర్థిక ఇబ్బందులు చూసి పెద్ద మనసుతో స్పందించి కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జి బండారు శ్రీనివాస్ తన వంతుగా 10,000/-రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు. జనసైనికులకు ఏ ఆపద వచ్చినా మానవత్వంతో మిగిలిన జనసైనికులు ఆదరించడం, ఓదార్పు ఇవ్వడం పట్ల బండారు శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జనసేన కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాళ్ల డేవిడ్, మహా దేశ బాబులు, బొక్క ఆదినారాయణ, కట్టా రాజు, చల్లా వెంకటేశ్వరరావు, చల్లా బాబి, శిరిగినీడి పట్టాభి, కోట వరలక్ష్మి, కొండేటి హేమాదేవి, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.