మండల సర్పంచ్ సమైక్య అధ్యక్షులు అడబాల తాతకాపు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం

పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల మామిడికుదురు మండల పత్రికా సమావేశం మండల సర్పంచ్ సమైక్య అధ్యక్షులు అడబాల తాతకాపు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గత నెల 31వ తేదీన రాజమండ్రిలో జరిగిన వైఎస్సర్సీపీ కాపు నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ని విమర్శించిన నాయకులకు సమాధానంగా మీరు పవన్ కళ్యాణ్ ని విమర్శించే ముందు మీ ప్రభుత్వం కాపుల కోసం ఏమిచేసిందో చెప్పాలని. కాపు కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు ఏమైనాయి అని ప్రశ్నించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అన్ని కులాల వారు జనసేన వైపు చూస్తున్నారనే అక్కసుతో మీరు జనసేన మీద కాపు కులముద్ర వేయాలని మీరు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రజలు మీ కళ్లబొల్లి మాటలు వినే పరిస్థితిలో లేరని అన్నారు. ఈ సమావేశంలో మండల జనసేన అధ్యక్షులు జలెం శ్రీనివాసరాజా, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోతు కాశీ, కంకిపాటి నరసింహరావు, యిలి రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి మద్దింశెట్టి బుజ్జి, బత్తుల శేఖర్, మండల కార్యదర్శి కాట్రేనిపాడు నాగేంద్ర, ఎంపీటీసీ సభ్యులు చెరుకూరి పార్వతి సత్తిబాబు, గ్రామాశాఖ అధ్యక్షులు ఇంటి మహేంద్ర, పినిశెట్టి శేఖర్, తెలగారెడ్డి యేసు, బళ్ళ సతీష్, జనసైనికులు కోలా సురేష్, కొమ్ముల రాము, తెలంగారెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.