పవన్ కళ్యాణ్ ని టచ్ చేయాలంటే జనసేన సమూహాన్ని దాటాలి: డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై రెక్కీని నిర్వహిస్తున్నటువంటి వారికి, నిర్వహించమన్న వారికి కూడా చెబుతున్నాను అర్జెంటుగా మీరు మూట ముళ్ళు సర్దుకుని వెళ్లిపోవాలి, లేదంటే మీరు జనసేన సునామీని తట్టుకోలేరని డాక్టర్ శ్రీధర్ పిల్లా హెచ్చరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ని టచ్ చేయాలంటే జనసేన సమూహాన్ని దాటుకుని వెళ్లాల్సి వస్తుందని అవసరమైతే మేమందరం జనసైనికులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఒక కాంపౌండ్ వాల్ కంటే స్ట్రాంగ్ గా నిలబడతామని, పవన్ కళ్యాణ్ టచ్ చేయాలంటే మమ్మల్ని దాటుకుని వెళ్లలేరని కూడా మీడియా ముఖంగా మీకు హెచ్చరించడం జరుగుతుంది. రాబోయే విపత్తులనుండి కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ కి లేఖ రాసి జెడ్ కేటగిరి ఇవ్వాలని మేము కోరుతున్నాము. జనాలలో పవన్ కళ్యాణ్ కి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేని సన్నాసులు ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి అంటూ పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్లా చెప్పడం జరిగింది.