పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాట తీస్తాం: షేక్ మహబూబ్ మస్తాన్

ఆత్మకూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నివాసం వద్ద గత రెండు రోజులు ముందు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి చిన్న పాటి హాని జరిగినా, అలాగే చిన్నపాటి పిన్ గుచ్చుకునా, రాష్ట్రం అతలాకుతలమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలని, పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలని కొందరు కుట్రలు చేస్తన్నారని, వెంటనే కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ భద్రత ఏర్పాటు చేయాలని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మరియు అనంతసాగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నరేష్ కుమార్, జాషువా, పెంచలరావు, అంజి, చిన్నా జనసేన పాల్గొనడం జరిగింది.