పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఖబర్దార్ – బంటుమిల్లి జనసేన సవాల్

పెడన, బంటుమిల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బంటుమిల్లి మండల జనసైనికులు మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, చూస్తుంటే తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద, మరియు ఆయన కాన్వాయ్ వెంట కొంత మంది ఆగంతకులు రెక్కీ నిర్వహించడం జరిగిందని, వారిపై వారిపై చర్యలు తీసుకోవాలని, పవన్ కళ్యాణ్ జోలికొస్తే రాష్ట్రంలో లక్షలాది జనసైనికులు తిరగబడతారు జాగ్రత్త. పవన్ కళ్యాణ్ ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే దాడి చేయాలని కుట్రలు చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలని కుట్ర జరిగిందని మాట్లాడితే డీజీపీ గానీ ముఖ్యమంత్రి గానీ స్పందించలేదంటే దాడికి కుట్ర జరిగిందని నేడు నిర్ధారణ అయింది. కేంద్రం తక్షణమే పవన్ కళ్యాణ్ కి జెడ్ కేటగిరి సెక్యూరిటీని కేటాయించాలి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండల అధ్యక్షుడు ర్యాలీ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు దాసరి నాంచారయ్య(ఉమర్), గోట్రు రవికిరణ్, ప్రధాన కార్యదర్శులు అర్జా ఉమాశంకర్, జన్యావుల నాగబాబు, కార్యదర్శి సుబ్బు మారుబోయిన, చిటికినేని రవి తేజ, పుప్పాల సూర్యనారాయణ,పు ల్లేటి దుర్గారావు, వెంట్రపాటి నాగబాబు, యలవర్తి ఆంజనేయులు, దూడల పాండు రంగారావు, మోచెర్ల శర్మ, పయ్యావుల, నాగ అంజనేయులు, బత్తుల సాంబశివరావు, కొప్పినేటి నరేష్, కునంనేటి రామకొటేశ్వరావు, ముక్కుళ్ళు శ్రీనివాసరావు, ప్రత్తి రాంబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.