జనసైనికుడు దివంగత పిల్లా శ్రీనివాస్ కుటుంబానికి 5లక్షల చెక్
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం పేరూరుకు చెందిన పిల్లా శ్రీనివాస్ ఇటీవల రోడ్ ప్రమాదంలో మరణించారు. మృతి చెందిన పిల్లా శ్రీనివాస్ తల్లికి జనసేన పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతులమీదుగా 5లక్షల చెక్కు అందచేసారు. వారికి జనసేన కుటుంబం చాలా పెద్దదని, ప్రతిదానికి మీకు అండగా ఉంటుందన్నారు. మీకు జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మీకు అండగా ఉంటారని ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-04-at-16.22.16-1024x533.jpeg)