పవన్ కళ్యాణ్ మీద హత్యయత్నాన్ని తీవ్రంగా ఖండించిన పెనుగంచిప్రోలు జనసేన

పెనుగంచిప్రోలు, పవన్ కళ్యాణ్ మీద హత్యయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం పెనుగంచిప్రోలులోని జనసేన జెండా దిమ్మ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. మరియు పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంలో ఉన్న ప్రతి జనసైనికుడు, వీరమహిళ అండ దండగా ఉంటామని అవసరమైతే ఆయన ప్రాణానికి జనసైనికుల ప్రాణం అడ్డుగా ఉండి కాపాడుకుంటామని, ప్రాణ త్యాగానికైనా సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ క్యాటగిరి రక్షణను పవన్ కళ్యాణ్ కి కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల అధ్యక్షుడు తునికిపాటి శివ ఉపాధ్యక్షులు, తన్నీరు గోపినాధ్, వైఎన్ఆర్ మాస్టర్, బలుగురి సాగర్ ప్రధాన కార్యదర్శి, దుడ్ల వినయ్, కుభగిరి గోపి, నాగరాజు, నవీన్, సైదులు, సుంకర నాగరాజు, ఉపేంద్ర, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.