ద్వారకా తిరుమల నడిచి వెళ్లే భక్తులకు ఉంగుటూరు జనసేన భోజన వసతులు

ఉంగుటూరు, జనసేన పార్టీ తరఫున ఉంగుటూరు నియోజకవర్గం జనసైనికులు వీర మహిళలు కార్తీక మాసం సందర్భంగా ఈ 30 రోజులు ద్వారకా తిరుమల నడిచి వెళ్లే భక్తులకు భోజన వసతులు మరియు పళ్ళు, మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం కోసం ఆయన ఆయురారోగ్యాలతో తులతూగాలని, ఆయన భక్తుడు ముత్యాల వాసు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు రేపల్లె దేవి, మాదిరెడ్డి విజయలక్ష్మి మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.