జగనన్న కాలనీలో మౌళిక సదుపాయాలను పరిశీలిస్తాం: కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని అన్ని గృహ నిర్మాణ పథకాలు జగనన్న కాలనీలు, టిడ్కో ఇల్లు సందర్శించి ఒక్కొక్క కాలనీలో ఎన్ని ఇళ్ళు మంజూరయ్యాయి, ఇప్పటి వరకు ఎంత మంది లబ్ధిదారులకు విడతల వారీగా ప్రభుత్వం నిధులు అందజేసింది, బేస్మెంట్, లింటెల్, రూఫ్ దశలో ఎన్ని ఇల్లు ఉన్నాయో పరిశీలిస్తూ, టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు అందించారా లేదా అనే సముదాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, లబ్ధిదారుల ఇబ్బందులన్ని రికార్డు చేస్తూ, పేదల కాలనీలకు ఇసుక సరఫరా ఏ విధంగా ఉందో సకాలంలో నిధులు వస్తున్నాయో లేదో అడిగి తెలుసుకుంటామని ప్రభుత్వం ఇస్తున్న 1.80 వేల రూపాయలు కాకుండా ఎంత మొత్తం లబ్ధిదారుల చేతి నుంచి పడుతుందో, జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు ఎంత ధర చెల్లించారు ఎంత ఖర్చు చేశారో ప్రస్తుతం ఆ భూముల పరిస్థితి ఏ విధంగా ఉందో గుర్తిస్తామని, కాలనీలో మౌళిక సదుపాయాలను పరిస్థితిని పరిశీలించి ప్రతి అంశాన్ని ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా #JaganannaMosam అనే హ్యాష్ ట్యాగ్ తో జగనన్న ఇళ్ల దుస్థితి, కాలనీల పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వానికి ప్రజలకు తెలిసేలా చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని 14వ తేదీన సోషల్ ఆడిట్లో భాగంగా గ్రామ సచివాలయంకు వెళ్లి సదరు గ్రామంలో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు లబ్ధిదారుల ఎంపికకు అనుసరించిన విధివిధానాలు ఏంటి ఈ కార్యక్రమాలను 3 రోజులు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా స్థానిక మీడియా ద్వారా సమాచారం ఇస్తామని ఈ సందర్భంగా కదిరి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు హర్షద్అయుబ్, గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శులు మణికంఠ, సుదర్శన్ మరియు గోపి పాల్గొన్నారు.