జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు

అనంతపురం, సింగనమల, జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు టిసి వరుణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 12, 13, 14 తేదీలలో సింగనమల నియోజకవర్గంలోని 6 మండలాలలో జగనన్న కాలనీలను సందర్శించి వాటిపై జరిగిన అవినీతిని ఎండగట్టి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది కావున నియోజకవర్గంలోని ఆరు మండలాల జనసైనికులు వీర మహిళలు పాల్గొని ప్రభుత్వం యొక్క అవినీతిని బట్టబయలు చేయాలని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ జిల్లా సహాయ కార్యదర్శులు బొమ్మన పురుషోత్తం రెడ్డి దివే కృష్ణమూర్తి మండల కన్వీనర్లు జి ఎర్రి స్వామి, తోట ఓబులేసు, భార్గవ్, రామ్మోహన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.