పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా హోరెత్తిన జగనన్న మోసం

పిఠాపురం, జనసేన పార్టీ అధినాయకత్వం పిలుపుమేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు ఊట ఆదివిష్ణు(నాని బాబు) నాయకత్వంలో, కందరాడ జనసేన ఎంపీటీసీ పిల్లా సునీత సూర్యనారాయణల సమక్షంలో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా టిట్కో ఇళ్ల దుస్థితి తెలుపుతూ మోసపోయిన లబ్ధిదారుల పరిస్థితి వివరిస్తూ #జగనన్నమోసం మరియు జగనన్న ఇల్లు పేదలకన్నీళ్లు అనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. రూరల్ నర్సింగపురం గ్రామం నందు రెండు సంవత్సరముల క్రితం 80 ఎకరాల భూమిని సేకరించి నియోజకవర్గ వ్యాప్తంగా 10 గ్రామాల ప్రజలకు స్థలాలు ఇస్తామని నమ్మపలికి నేటికీ ఇవ్వలేదు సరి కదా కనీసం సేకరించిన భూమిని చదును కూడా చేయలేదు. రెండు లారీలతో తెచ్చిన కొలత రాళ్లు కూడా నిరుపయోగంగా అధికారుల రాకకై ఎదురు చూస్తున్న పరిస్థితిని ఈ డిజిటల్ ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి తెచ్చిన నియోజకవర్గ జనసేన నాయకులు. పిఠాపురం పట్టణాన్ని ఆనుకుని రైల్వే గేట్ పక్కన 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన టిడ్కో అపార్ట్మెంట్ భవనములు గృహప్రవేశానికి కూడా నోచుకోక నేటి ప్రభుత్వం వాటిపై రుణాలు పొందడానికి బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగిస్తూ రంగులు మాత్రమే మార్చి పబ్లిసిటీ చేసుకున్న వైనాన్ని ఎండగట్టిన పిఠాపురం జనసేన శ్రేణులు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీటీసీ అభ్యర్థులు పట్టణ కౌన్సిలర్ అభ్యర్థులు పలు గ్రామాల జనసేన నాయకులు, నియోజకవర్గ దళిత నాయకులు మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.