నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు
నిడదవోలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, కాటకోటేశ్వరం గ్రామంలో జగనన్న ఇల్లు పేదలందరి కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న లే అవుట్ ల పరిశీలన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ గ్రామంలో స్థలాలు ఇచ్చి 2 సంవత్సరాల కాలం అయినా ఇంత వరకు ఒక్క ఇల్లు కూడా శంకుస్థాపన చేయలేదని, అంతా అవినీతి మయమే ద్వే్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని నిడదవోలు మండల అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ నాయకులు రంగా రమేష్, మండల ఉపాధ్యక్షులు మేడా పూర్ణ చంద్రరావు, మండల కమిటీ సభ్యులు కొప్పిశెట్టి మంగరాజు, కరీబండి ఈశ్వరరావు, గుంటుపల్లి శ్రీను, ఉప్పులూరి వాసు, గ్రామ అధ్యక్షులు కస్తూరి సుబ్బారావు, నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-13-at-20.09.35-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-13-at-20.09.33-1024x577.jpeg)