నేడు బీజేపీలోచేరనున్న విజయశాంతి

మాజీ ఎంపీ, సినీనటి విజయశాంతి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆమె భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి విజయశాంతి బీజేపీ లో చేరనున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విజయశాంతి పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆమె బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు. నేడు విజయశాంతి బీజేపీలో చేరే అవకాశముంది.