పితాని ఆధ్వర్యంలో గ్రామ సచివాలయాలలో సోషల్ ఆడిట్

ముమ్మిడివరం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన జగనన్న మోసం జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమం సోమవారం మూడో రోజు సందర్భంగా గ్రామ సచివాలయాలలో సోషల్ ఆడిట్ జనసేన పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో కాట్రేనికోన మండలంలో చెయ్యేరు, లక్ష్మీవాడ, కాట్రేనికోన, గెద్దనాపల్లి, ఉప్పూడి, దొంతుకూరు కందికుప్ప పల్లంకూరు గ్రామ సచివాలయాలలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన వివరాలు లబ్ధిదారులు వివరాలు స్థలాలు ఎంత మొత్తం ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసిందో ఆ వివరాలన్నీ గ్రామ సచివాలయాల్లో అడిగి సేకరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ మోకా బాల ప్రసాద్, నూకల శ్రీరామ దుర్గ, సంసాని పాండురంగారావు, పిల్లి గోపి, బీమాల సూర్య నాయుడు, రంబాల చౌదరిబాబు, పెమ్మడి గంగాద్రి, ఓలేటి శ్రీను, పెమ్మాడి శ్రీను, పాలెపు రాజు, బల్ల కుమార్, వీర మహిళలు ఓగూరి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, వజ్రపు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.