జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్

భీమవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేశానుసారం జగనన్న ఇళ్లు – పేదలందరి కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా నందమూరిగురువు, పెరికిపాలెం గ్రామాలలో జగనన్న లే అవుట్ లను జనసైనికులు, వీరమహిళలు సందర్శించి లబ్ది దారులతో మాట్లాడి వారు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకొని నిజ నిజాలు వెలుగులోకి తీసుకువచారు మీ తరుపున మేము పోరాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు భారీ ఎతున్న తరలి వచ్చారు.