బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలందరి కన్నీళ్లు

తాడేపల్లిగూడెం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు మూడవ రోజు జగనన్న ఇల్లు – పేదలందరి కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలో టిడ్కో ఇళ్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ దాదాపు మూడున్నర ఏళ్ళు కావస్తున్నా ప్రజల సమస్యలను పట్టించుకోకపోగా కనీసం ప్రజలకు ఎలాట్ అయిన ఇళ్ళు వాళ్లకి ఇవ్వకుండా వారి దగ్గర నుండి డబ్బులు లాక్కుని ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న ఈ అధికార ప్రభుత్వం ప్రజల సొమ్మును అధికారుల జేబుల్లో వేసుకుని పథకాల పేరు చెప్పి దాదాపు 15 వేల కోట్ల రూపాయలు లూటీ చేసిందని టిడ్కో ఇళ్ళ ప్రజలకు ఎల్లప్పుడూ జనసేనపార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.