ముచ్చటగా మూడోసారి పవన్‌తో శ్రుతి

తాజాగా శ్రుతిహాసన్‌ ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో కొంతసమయం సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ”వకీల్‌సాబ్‌’ చిత్రంతో పవన్‌ రీఎంట్రీ ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నేను కూడా భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. జనవరి నుంచి ‘వకీల్‌సాబ్‌’ సెట్‌లోకి అడుగుపెట్టనున్నాను. ప్రస్తుతానికి ఆ పాత్ర కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నా. నిజం చెప్పాలంటే… కొంతమంది హీరోలతో మాత్రమే రెండోసారి లేదా మూడోసారి కలిసి పనిచేసే అవకాశం పొందాను. ‘క్రాక్‌’ సినిమా కోసం రవితేజతో రెండోసారి కలిసి పనిచేశాను. అలాగే సూర్యతో కూడా రెండుసార్లు స్ర్కీన్‌ పంచుకున్నాను. ‘గబ్బర్‌సింగ్‌’, ‘కాటమరాయుడు’ చిత్రాల తర్వాత మూడోసారి పవన్‌తో కలిసి నటించే అవకాశం ‘వకీల్‌సాబ్‌’ వల్ల నాకు దక్కింది. మిగతా ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే ఇటీవల ఓ బాలీవుడ్‌ చిత్రానికి ఓకే చేశాను. త్వరలోనే దాని వివరాలు వెల్లడిస్తాను’ అని శ్రుతిహాసన్‌ అన్నారు.