అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: రాజానగరం మండలం, పాలచర్ల గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వేమగిరి బాబురావు తీవ్రమైన అనారోగ్యంతో (పచ్చ కామెర్లు) బాధపడుతుండగా… విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి… వైద్య ఖర్చుల నిమిత్తం 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వీరి వెంట సీనియర్ నేతలు గంగిశెట్టి రాజేంద్ర, సూరపరెడ్డి రాజారావు, కొత్తపెళ్లి బుజ్జి, బుద్దాల అర్జున్, రావిపాటి సాయిబాబు, రాగిపాటి శ్రీను, పిల్లా సాయి, బద్రి లోకేష్గా, పూసల మురళి, బోయిన భార్గవ్, పేకేటి పండు, తేతినేని వీరబాబు, మద్దిరెడ్డి బాబులు, అడ్డాల దొరబాబు, బోయిడ్ వెంకటేష్, ఇతర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.