పిఠాపురం నియోజకవర్గంలో టీం పిడికిలి పోస్టర్ ఆవిష్కరణ

ఉభయగోదావరి జిల్లాల జనసేన పార్టీ మహిళా కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన నాయకులు మురాలశెట్టి సునీల్ కుమార్, ఊట ఆదివిష్ణు సమక్షంలో ఆవిష్కరించిన ఈ పోస్టర్ కార్యక్రమంలో కందరాడ జనసేన పార్టీ ఎంపీటీసీ పిల్లా సునీతసూర్యనారాయణ, గొల్లప్రోలు పట్టణ జనసేన నాయకులు మర్రి దొరబాబు, విరవ జనసేన నాయకులు తమ్మునబోయిన సుదర్శన్ మరియు నియోజకవర్గ జనసేన వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు. చల్లా లక్ష్మీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేంతవరకు అలుపెరగని పోరాటం చేస్తామని వివిధ విభాగాలుగా అందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ టీం పిడికిలి వారిని అభినందించారు. మురాలశెట్టి సునీల్ కుమార్ సభ్యులను అభినందిస్తూ పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా ప్రతి చోట జనసేనకి జనం నీరాజనాలు పలుకుతున్నారని రానున్నది జనసేన ప్రభుత్వాన్ని తెలిపారు. ఊట ఆదివిష్ణు జనసేన పార్టీకి యువత ఆయువుపట్టు లాంటిదైతే సోషల్ మీడియా గుండె లాంటిదని, టోటల్ మీడియాలో ఐడియాలజీ ప్రజలందరికీ చేరువైయ్యేలా చేస్తున్నా టీం పిడికిలి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీం పిలికిలి జిల్లా విభాగపు మోటివేటర్ గంజి గోవిందరాజు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరిని పల్లకిలో మోయడానికి కాదు మేమున్నది. అధికారం కోసం అంధకారంలో ఉన్న జనాలకి వెలుతురు ఇవ్వడం కోసం జనసేన ఉన్నది. అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా మైలవరపు రాజా నేతృత్వంలో జనసేన పార్టీ అభిమాన సోషల్ మీడియా గ్రూప్ టీం పిడికిలి వారు తగ్గేదేలే అంటూ 175 నియోజకవర్గాలలో ఆటోలకు అంటించే స్టిక్కర్స్ గా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగినది అని తెలిపారు. ఇంతకు పూర్వం కూడా వేరువేరు సందర్భాల్లో మూడు పోస్టర్స్ ను రిలీజ్ చేయడం జరిగినది అని

  1. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ ఉదారతను వివరిస్తూ ఒక పోస్టర్.
  2. టిడిపి దత్తపుత్రుడు అంటూ అసత్య ఆరోపణలు పవన్ కళ్యాణ్ పై చేస్తూన్న అధికార పక్ష వైఖరిని ఖండిస్తూ.. దమ్ముంటే సిబిఐ దత్త పుత్రుడు నిబద్ధత నిజాయితీ నిరూపించుకోవాలని సవాలను చేస్తూ వేరొక పోస్టర్.
  3. ఎన్ని దశాబ్దాలు గడిచిన అన్నదాతల అర్తనాథాలకు ముగింపు లేకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ రైతుకు కావలసింది గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర అని తెలిసే విధంగా మరొక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగినది. ఇప్పుడు ప్రజలు సమాజ హితం కోసం పవన్ కళ్యాణ్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఎన్నాళ్ళు అక్రమ అవినీతి పాలన జరిపిన అధికార ప్రతిపక్షాలు తప్పుకునే టైం వచ్చిందని తెలిసే విధంగా ప్రస్తుత పోస్టర్ రిలీజ్ చేయడం జరిగిందని గంజి గోవిందరాజు తెలిపారు.