స్మశాన వాటికకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజవర్గం: గాజువాక నియోజవర్గం 64వ వార్డు, గంగవరం గ్రామం స్మశాన వాటికకు 14 లక్షలు రూపాయల నిధులతో శుక్రవారం 64వ వార్డు కార్పొరేటర్ దల్లిగోవింద్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం స్మశాన వాటిక ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో పరిశీలించడం జరిగింది. ఇన్ని సంవత్సరాల కాలంలో స్మశాన వాటిక అభివృద్ధి జరుగుతున్నందుకు గంగవరం గ్రామం ప్రజలు స్వచ్ఛంద నాయకులు స్వచ్ఛంద సంఘాలు గోవింద్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పై దృష్టి సాధించేవారు ప్రజల్లో ఉంటారని ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడతారని ఆయన ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య, రాష్ట్ర మత్స్య విభాగం కార్యదర్శి కదిరి సత్యా, పి నూకాలు. కె దాసు పి ధనరాజు, దేవుడు, చిరంజీవి, పెంటారావు, నూకరాజు, సోమేశ్, శ్రీరామ్ పాల్గొన్నారు.