కాకినాడ జనసేన ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి గారి 194వ జయంతి వేడుకలు

కాకినాడ: వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి గారి 194 వ జయంతి సందర్భంగా కాకినాడ భానుగుడి సెంటర్ జి.కే.రెసిడెన్సీ నందు ఉభయ గోదావరి జిల్లాల మహిళా రీజినల్ కోఆర్డినేటర్ల శ్రీమతి కడలి ఈశ్వరి మరియు ముత్యాల జయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దీనికి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి సుంకర కృష్ణవేణి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష సమక్షంలో చిన్నారి నిమ్మన విష్ణు సహస్ర చే లక్ష్మిభాయి గారి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన ఝాన్సీ వీరమహిళా విభాగం ఎప్పుడూ పోరాట పటిమలో ఝాన్సీ లక్ష్మి భాయి ని స్ఫూర్తిగా తీసుకుంటుందని, ఆమెలో ఉన్న తెగువు ప్రతీ వీరమహిళలలో ఉంటుందని, అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ప్రతిఙ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు శ్రీమతి పెంకే వెంకటలక్ష్మి, పిల్లా రమ్య జ్యోతి, పాఠంశెట్టి కాశీరాణి, గిరిజాల లక్ష్మీదేవి, కె.సూర్య కుమారి, వెంకట లక్ష్మి, కె.కుమారి, బి.మరియా, ఎమ్ హైమావతి, ఎమ్ మాలతీ, డి.శిరీష, డి.సు జాత, డి దీప్తి, పెనుమాల లక్ష్మి, అడ్డగళ్ల సిరి సతీష్ పాల్గొని విజయవంతం చేశారు.