కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జనసేన కార్యక్రమం
అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జనసేన కార్యక్రమం ద్వారా అనంతపురం నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ రోడ్డు నందు క్రియాశీలక సభ్యులను కలిసి వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేయడమైనది.ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, భవానీ నగర్ మంజునాథ్, వెంకటాద్రి నాయక్, హేమంత్ నాయక్, పురుషోత్తం నాయక్ , పోతురాజుల అశోక్, పబ్బిశెట్టి మంజునాథ్, ప్రవీణ్ కుమార్, నారాయణ నాయక్, ముస్తాక్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-19-at-7.42.56-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-19-at-7.42.58-PM-1024x576.jpeg)