ఝాన్సీ లక్ష్మీబాయికి నివాళులర్పించిన దారం అనిత

మదనపల్లి: జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ నేడు అసమాన ధీశాలి, అపూర్వ యుద్దనిపుణురాలు, మేధా శక్తి సంపన్నురాలు, స్వాతంత్ర్య సేనాని, ఝాన్సీరాణి లక్ష్మీబాయి 194వ జయంతి. ఆమె స్ఫూర్తితో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీర మహిళా విభాగం స్థాపన చేసిన సంగతి మనందరికీ విదితమే ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ఆ వీర నారీశిరోమణి జయంతిని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిద్దాం. జనసేన వీర మహిళాశక్తిని ఎలుగెత్తి చాటుదాం. మహిళాశక్తిని చైతన్య పరిచేందుకు ఈ ఉత్సవం ఒక సదవకాశం. మన పార్టీ అధ్యక్షులు జన హృదయ నేత, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాదర్శాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా, వారు మహిళలకు ఇచ్చే గౌరవం, ప్రాముఖ్యతను ప్రజలకు తెలిసే విధంగా ఈ ఉత్సవాన్ని జరిపి పార్టీని మరింత పటిష్టపరిచేందుకు మనవంతుగా కృషి చేద్దాం అని అన్నారు.