యుద్ధ వీరునిగా ప్రభాస్
ప్రభాస్, దీపికా పడుకోన్ కలసి నటించనున్న ప్రభాస్ 21వ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాత అశ్వినీదత్ ఓ భారీ విజువల్ వండర్గా నిర్మించే ఈ చిత్రంలో ప్రభాస్ యుద్ధ వీరునిగా నటిస్తారనీ, ఫిక్షనల్ వార్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం పూర్తయిన తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.