మేడ గురుదత్ ప్రసాద్ కు రథోత్సవ ఆహ్వానం

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ శ్రీ శ్రీ శ్రీ దేవిగౌరీశంకరుల రథోత్సవాలు ది.26-11-2022, శనివారం జరుగనున్నాయి. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ను శ్రీరంగపట్నం గ్రామస్తులు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండల జనసేన జనసేన పార్టీ అధ్యక్షులు కరిచర్ల విజయ్ శంకర్, కోరుకొండ జనసేన పార్టీ నాయకులు తెలగంశెట్టి శివ, పోసి బాబు, రచ్చపోతుల సురేష్, చదువు నాగు, చదువు ముక్తేశ్వరరావు రాజానగరం మండల నాయకులు అడబాల హరి, మెడిద వీరబాబు, గ్రామ పెద్దలు తనకాల శివాజీ, కాళ్ళ శివ శ్రీరంగపట్నం జనసేన పార్టీ నాయకులు తన్నీరు తతాజీ, జనసేన పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ అడప అంజి బాబు, బొబ్బిలి సత్తిబాబు, దొడ్డి అప్పలరాజు, శ్రీరంగపట్నం జనసేన పార్టీ యువత అధ్యక్షులు తనకాల అజయ్ కుమార్, జోమ్మల ఫణీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.