శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 55వ నవరాత్రి మహోత్సవాలలో పాల్గొన్న అనుశ్రీ

రాజమండ్రి సిటీ, స్థానిక మెయిన్ రోడ్డు వద్ద శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 55వ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అఖండ దీపారాధన జరిగింది. ఆలయ కమిటీ సభ్యులైన ముక్కమల జగదీశ్వరరావు (స్వామి) ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని ఆలయాన్ని సందర్శించి భగవంతుని దర్శించుకుని ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు మరియు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.