ఆడబిడ్డలపట్ల వైసీపీ అనైతిక చర్యలకు వీరమహిళల నిరసన
వైజాగ్: నరసాపురంలో సీఎం సభలో ఆడబిడ్డలు నల్ల చున్నీలు దరించి వచ్చిన వారిచే చున్నీలు తీయించి.. అవమానకరంగా ప్రవర్తించిన వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా, విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన ఇంచార్జి పసుపులేటి ఉషా కిరణ్ ఆధ్వర్యంలో వీరమహిళలు గాంధీ గారి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన ప్రదర్శన చేసారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీరమహిళలు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి, పార్టీ కార్యదర్శి ప్రశాంతి, ఉత్తరాంధ్ర ప్రాంతీయ మహిళా కమిటీ త్రివేణి, శారని, నాగలక్ష్మి, కిరణ్, కార్పొరేటర్ అభ్యర్థులు అడబాల లక్ష్మి టీం, ముమ్మిన నాగమణి టీం, పోతిన అనురాధ టీం, దుర్గ రెడ్డి, కుమారి కళ్యాణం, పిన్నింటి పార్వతి, హర్ష వల్లి, మాదక గౌరీ, మంగ, సురేఖ, బిట్టా రాజేశ్వరి, గుడివాడ స్వాతి, కొల్లి రూప, బొడ్డేటి హేమ, వానపిల్లి గాయత్రి మరియు జనసైనికులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-23-at-6.49.06-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-23-at-6.49.06-PM-1-1024x473.jpeg)