తిరుమల పాదయాత్ర చేస్తున్న జన సైనికులకు సంఘీభావం తెలిపిన రాటాల రామయ్య
సిద్ధవటం: 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో పోరుమామిళ్ల మండలానికి చెందిన జనసైనికులు గురువారం తిరుమల పాదయాత్ర చేపట్టారు. జన సైనికుల పాదయాత్ర శుక్రవారం మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చేరడంతో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య వారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం పరదాల చాటున తన పాలన కొనసాగిస్తున్నారన్నారు. సమస్యలపై మాట్లాడాలంటే భయభ్రాంతులకు గురిచేయడం, కేసులు పెట్టి మభ్య పెట్టడం భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. కేవలం సంక్షేమ పథకాలు కూడా అనుకూలమైన వ్యక్తులకే పథకాలను అందిస్తున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలో వచ్చి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవాలనే దృఢ సంకల్పంతో జనసేన నాయకులు కార్యకర్తలు చేపట్టిన తిరుమల మహా పాదయాత్రను జయప్రదం చేయాలని ఆ తిరుమల వెంకటేశ్వర ఆశీస్సులు తప్పక పవన్ కళ్యాణ్ కు కలగాలన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-25-at-20.41.57-1024x776.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-25-at-20.42.12-1024x576.jpeg)