పందులు, పిచ్చికుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోండి

బద్వేల్ నియోజకవర్గం, బద్వేల్ మున్సిపాలిటీలో పందులు, పిచ్చికుక్కలు, కోతుల స్వైర విహారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కారణంగా వాటిని బద్వేల్ టౌన్ కు దూరంగా తీసుకెళ్లి అడవి ప్రాంతంలో వదిలి పెట్టాలని బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ కి జనసేన తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ నాయకులు బసవి రమేష్, బద్వేల్ యూత్ లీడర్ తరుణ్, బద్వేల్ మండల నాయకులు సురేంద్ర, గణేష్ పాల్గొన్నారు.