గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎన్ని సమస్యలు పరిష్కరించారు?: శ్రీరాములు

అరకు: వైసీపీ ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి, వందరోజులు పూర్తి చేసి, సంబరాలు కూడా చేసుకున్నాయి. ఈ సందర్భముగా జనసేన పార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ఆరకు నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం వందరోజులు పూర్తి అయిన సందర్భముగా సంబరాలు చేసుకోవడం కాదు, గడప గడప కు తిరిగి సమస్యలు కళ్లారా చూసారు.. ఎన్ని గ్రామాల్లో సమస్యలున్నాయి ?, ఎన్ని గ్రామాల్లో రోడ్లు ఉన్నాయి?, ఎన్ని గ్రామాల్లో మంచి నీరు ఉంది ? అని ప్రశ్నించారు.. గడప గడపలో తిరిగిన అధికారులు స్థానిక శాసన సభ్యులు వారు ఎన్ని సమస్యలు పరిష్కరించారు. సమస్యలు తెలుసుకోవడానికి కార్యక్రమం చేశారా? సమస్యలు పరిష్కరించడానికి కార్యక్రమాలు చేస్తున్నారా ?, గడప గడప కు కార్యక్రమాలు చేసి ఎన్ని గ్రామాల్లో సమస్యలు గుర్తించారు, ఎన్ని సమస్యలు పరిష్కరించారు వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలి . గిరిజన ప్రాంతాల్లో బస్సు లు లేవు?, కొన్ని మారుమూల గ్రామాల్లో అసలు రోడ్లు లేని పరిస్థితి?, మంచినీటి సదుపాయం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి.. ఇవి గడప గడప కార్యక్రమంలో కనిపించలేదా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులేదా..?. వందరోజులు పూర్తి చేసి సంబరాలు చేయడం కాదు ముందు గిరిజన గ్రామాలు అభివృద్ధి చేయండి అని జనసేన పార్టీ నాయకులు మాదాల శ్రీరాములు తీవ్రస్థాయిలో ప్రభుత్వం పై మండిపడ్డారు.