సఖి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక కార్యక్రమంలో పాల్గొన్న మాకినీడి

పిఠాపురం: పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామంలో సఖి లైన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన సామాజిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి పాల్గొన్నారు. ముందుగా రాజులమ్మకు బట్టలు, రేషన్ సరుకులు, పండ్లు అందజేసి ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న వృద్ధులకు భోజనం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ శేషుకుమారి మాట్లాడాతూ.. ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరం, చిత్రాడలో లైన్స్ క్లబ్ సఖి సభ్యులు సావిత్రి గారు వారి తల్లిదండ్రులు కోరిక మేరకు వీరికి ఇక్కడ అన్నదానం చేయటం, పేషెంట్ రాజులమ్మకు నిత్యావసర సరుకులు ఇవ్వటం.. సఖి ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ సేవా కార్యక్రమంలో నేను ఒక భాగం అవ్వటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అనేక చోట్ల మీరు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. మా పిఠాపురం నియోజవర్గంలో మా జనసేన ఆధ్వర్యంలో చేయాలని కోరగా వెంటనే స్పందించి మన గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆహారం ఇవ్వటం, ఇప్పుడు చిత్రాడలో సేవా కార్యక్రమాలు చెయ్యటం జరిగింది. వీరందరికీ కూడా నా తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే రాజులమ్మ గతంలో నా హస్బెండ్ డాక్టర్ వీరప్రసాద్ సమక్షంలో హైదరాబాదులో చికిత్స నిమిత్తం 3 ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఈరోజు ఆమె లేచి నుంచుంటే నాకు చాలా ఆనందంగా ఉందని, వారు చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని అన్నారు. అలాగే ప్రత్యేకంగా మా చిత్రాడ జనసైనికులకు నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. లైన్స్ క్లబ్ సఖి సభ్యులు నాగలక్ష్మి మాట్లాడుతూ.. శేషు కుమారి గారి ఆధ్వర్యంలో చిత్రాడ గ్రామంలో రాజులమ్మకు రేషన్ ఇవ్వడం, వృద్ధులకు భోజనం అన్నదానం చేసి తను కూడా సఖి క్లబ్ లో భాగస్వామ్యం కావడం నాకు ఆనందదాయకం, క్లబ్ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూన్నను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి సమాజానికి సఖి క్లబ్ ద్వారా మహిళలు సేవ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సఖి ప్రెసిడెంట్ అరుణ కుమారి, లైన్స్ క్లబ్ ఆర్ సి సభ్యులు నాగలక్ష్మి, సావిత్రి, అమ్మాజీ, రమణి, జిల్లా జనసేన నాయకులు మొగలి అప్పారావు, చిత్రాడ జనసేన పార్టీ ఎంపీటీసీ దూలపల్లి రత్నం, పుణ్యమంతుల మూర్తి, వార్డు నెంబర్ గొల్లపల్లి గంగ, బావిశెట్టి నంది, దేశి రెడ్డి సతీష్, తేలుదొర, నిమ్మనదుర్గబాబు, బస్వా గోపి, నంద్యాల జాను, నాయుడు మణికంఠ, దేవ, గనియ్య , కోటిపల్లి కాశి, దూలపల్లి అన్నవరం, పెంట వెంకటేష్, కుమార్, పెంకే జగదీష్ జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.