ప్రాణవాయువు ఇచ్చే వృక్షాల ఆయువు తీసిన మహానేతలు

  • వృక్షో రక్షతి రక్షితః

పెడన: పెడనలో వైసిపి నాయకులు చివరకు మనిషికి ప్రాణవాయువును, నీడనిచ్చే వృక్షాలను కూడా వదలడం లేదు. పెడన పట్నంలోని బొడ్డు నాగయ్య జూనియర్ కళాశాలలో ఉన్న మహా వృక్షాలను కూల్చడం దుర్మార్గం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని క్రీడా సంబరాలు అంటూ లేనిపోని ఆర్భాటాలకు పచ్చని చెట్లు బలైపోయాయి. క్రీడలు స్వాగతించదగ్గవే, కానీ పచ్చల చెట్లను అందుకు బలిదానం చేయటం ఎంత మాత్రం సహించరాని నేరం. మట్టిని దోసుకుంటున్నారు, భూములు ఆక్రమించుకుంటున్నారు. అయినా మీ దాహం తీరలేదన్నట్టు చివరకు చెట్లను కూడా నరికి అమ్ముకుంటున్నారు. కాలేజీలో వృక్షాలను కూల్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. ఈ దుర్మార్గపు చర్యను ప్రకృతి ప్రేమికులు ప్రతి ఒక్కరూ ఖండించాలి.అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, చెట్లను కూల్చిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్ వి బాబు డిమండ్ చేసారు.