రహదారి పనులు పరిశీలించిన పేడాడ రామ్మోహన్

ఆముదాలవలస నియోజకవర్గం: ఆముదాలవలస నుండి పురుషోత్తపురం వరకూ నిర్మిస్తున్న ప్రధాన రహదారి నిర్మాణాలలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా గ్రావెల్ తో బెరము వేయాల్సి ఉండగా కాంట్రాక్టర్లు మట్టితో కూడిన పెద్ద పెద్ద బండరాళ్లతో వేయడం జరుగుతుంది. పనులను పరిశీలించిన ఆముదాలవలస జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు పనులు నిలుపుదల చేయాలని అలాగే గ్రావెల్ తో మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సంభాషించి, పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు.