రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడిని ఖండించిన దూదేకుల ఖాసీం

పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు రామచంద్ర యాదవ్ పైన జరిగిన దాడిని ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరి దూదేకుల ఖాసీం సైదా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాసిం సైదా మాట్లాడుతూ వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ పై వైసీపీ కిరాయి మూకలు దాడి పిరికిపంద చర్య అని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గంలో రైతుల కోసం సభ నిర్వహించాలనుకోవడం ఆయన చేసిన తప్పా..? సమస్యలపై మాట్లాడితే దాడులు చేస్తారా అన్నారు. బీసీ నాయకులపై దాడులు చేయడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని, ఈ దాడి కేవలం రామచంద్ర యాదవ్ పై జరిగిన దాడి మాత్రమే కాదని వెనుకబడిన వర్గాల అందరిపై జరిగిన దాడి అని, బీసీ కార్పొరేషన్ నిధులను ప్రక్కదారి పట్టిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బీసీలు అందరూ కలసి చమర గీతం పాడాలని పిలుపునిచ్చారు.