వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులపై బత్తుల ఫైర్

రాజానగరం: కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, రైతులు రోడ్డును పడ్డారని.. ప్రభుత్వం వెంటనే ధాన్యం కోనని పక్షంలో తీవ్రస్థాయిలో జనసేన పార్టీ ఉద్యమిస్తుందని.. కోరుకొండలో జరిగిన ధర్నాలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ అదికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపి పోలీసులతో వాగ్వాదం అనంతరం అధికారులను కొనుగోలు చేయుటకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో అడ్డాల శ్రీను, బదిరెడ్డి దొర, మట్టా నాగేశ్వర రావు, శ్రీరంగపట్నం జనసైనికులు, కోరుకొండ మండల జనసైనికులు పాల్గొన్నారు.