స్పందన కార్యక్రమంలో రాజంపేట జనసేన వినతి పత్రం

రాజంపేట: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు టి.సుండుపల్లి మండలంలో రహదారులు మరియు పాడుపడిన వంతెనలు యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కి స్పందనలో జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వారితో రామ శ్రీనివాస్ మాట్లాడుతూ…అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గ్రామీణప్రాంతాల్లో మరియు టి.సుండుపల్లె మండల పరిదిలో రోడ్లు చాలా అద్వాన్నంగా వున్నాయి, అదేవిధంగా వంతెనలు అక్కడక్కడా పాడుపడిపోయి ఉన్నాయి దీని వలన వాహనదారులు అనేక ఇబ్బందులు పడటమే కాకుండా అనేక ప్రమాదాలు కూడా జరుగుచున్నవి.. దీని వలన ప్రాణనష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. అన్నమయ్య జల్లా మొత్తం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు చాలా అధ్వాన్నంగా వున్నాయి. దీని వలన స్కూలు పిల్లలు సకాలంలో స్కూళ్ళకు వెళ్ళలేక, పేషెంట్లు, వృద్ధులు, గర్భిణీలు సకాలంలో హస్పటల్ కు పోలేక ప్రజలు చాలా ఇబ్బందులుపడుచున్నారు. ఈ సమస్యల పట్ల గతంలో కూడా జనసేన తరపున పలు సార్లు మీ దృష్టికి తీసుకొచ్చాము. కావున తమరు వెంటనే ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన సమస్యలను పరిష్కరించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.