రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి మరో వైసీపీ నాయకురాలు చేరిక

రాజానగరం: సీతానగరం గ్రామం వైసీపీ పార్టీలో అత్యంత కీలకంగా పనిచేసిన దళిత నాయకురాలు బెల్లపు విజయలక్ష్మి ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న వైసిపి ప్రభుత్వం తీరు పట్ల విసుగుచెంది మరియు జనసేన పార్టీ ఆశయాలు నచ్చి రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈమెకు వెంకటలక్ష్మి జనసేన కండువా మెడలో వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మద్దాల యేసుపాదం, పోసుపో రత్నాజీ రావు, బండి సత్య ప్రసాద్, బొడ్డపాటి నాగేశ్వరరావు, బొంగా స్టాలిన్ పాల్గొన్నారు.