అద్దేపల్లి బాలాజీ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం

తుని నియోజకవర్గం: తుని టౌన్ జనసేన సీనియర్ నాయకులు మరియు తుని నియోజకవర్గ రాదా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అద్దేపల్లి బాలాజీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం తుని టౌన్ లో హైమా నేత్రాలయం వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చెయ్యటం జరిగింది. వైద్య శిబిరం అనంతరం కేక్ కట్ చేసి బాలాజీ కు శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తాను అని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాసు, కిషోర్, ప్రసాద్, ఉదయ్, వేగిశెట్టి రమణ, కొండబాబు, వాడపల్లి రాము, మహేష్, గెడ్డమూరి సురేష్, వేమవరపు నాగబాబు, బొప్పన రాము, ముక్కురపు శివ, కన్నా, సాయి, శ్యాం, పి. ఈశ్వరరావు, ప్రకాష్, చిన్నారి మరియు నియోజకవర్గం జనసైనికులు పాల్గొని కంటి వైద్య శిబిరం విజవంతం చెయ్యటం జరిగింది.