బీమా చెక్ అందజేత.. కిషోర్ కుటుంబానికి జనసేన సమాచారం

  • డిసెంబర్ 13న క్రియాశీలక సభ్యుడు కిషోర్ కుటుంబానికి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా బీమా చెక్ అందజేత

తుని నియోజకవర్గం: కోటనందూరు మండలం, బొద్దవరం గ్రామ జనసైనికుడు వేగి హేమ కిషోర్ ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. మరణించిన జనసైనికుడు పార్టీ క్రియాశీలక సభ్యుడు కావున పార్టీ తరుపున 5 లక్షల రూపాయల చెక్కు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా డిసెంబర్ 13వ తేదీన కాకినాడలో ముత్తా క్లబ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని పార్టీ తరుపున బుధవారం వారి గ్రామానికి వెళ్లి కిషోర్ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాసు, సీనియర్ నాయకులు చోడిశెట్టి గణేష్ పాల్గొన్నారు.