క్రియాశీలక సభ్యుడు వెంకటేష్ కుటుంబానికి 5లక్షల చెక్కు అందజేసిన నాదెండ్ల

పాయకరావుపేట: పాయకరావుపేట మండలంలోని అరట్లకోట గ్రామ జనసైనికుడు వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన వెంకటేష్ కుటుంబానికి అన్ని విధాల జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఇచ్చే రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును వెంకటేష్ కుటుంబ సభ్యులకు పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ అందచేశారు. అనంతత్రం అధికార ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు గురించి రాష్ట్ర కార్యదర్శి శివదత్ సమక్షంలో అరట్లకోట పంచాయితీ ప్రెసిడెంట్ పులగపురి అప్పలనర్శను అడిగి తెలుసుకున్నారు.