క్రియాశీలక సభ్యుడు వెంకటేష్ కుటుంబానికి 5లక్షల చెక్కు అందజేసిన నాదెండ్ల
పాయకరావుపేట: పాయకరావుపేట మండలంలోని అరట్లకోట గ్రామ జనసైనికుడు వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన వెంకటేష్ కుటుంబానికి అన్ని విధాల జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఇచ్చే రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును వెంకటేష్ కుటుంబ సభ్యులకు పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ అందచేశారు. అనంతత్రం అధికార ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు గురించి రాష్ట్ర కార్యదర్శి శివదత్ సమక్షంలో అరట్లకోట పంచాయితీ ప్రెసిడెంట్ పులగపురి అప్పలనర్శను అడిగి తెలుసుకున్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-09-at-3.24.53-PM.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-09-at-3.24.54-PM-1024x580.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-09-at-3.24.56-PM-1024x682.jpeg)