పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: శనివారం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయవారాలు కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ రాజోలు నియోజకవర్గం శివకోడు గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన పినిశెట్టి రంగనాథ స్వామి కుటుంబ సభ్యులు పినిశెట్టి బుజ్జిని పరామర్శించారు. అమలాపురం నియోజకవర్గం చెందిన జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఇటీవల అకాల మరణం చెందిన పిండి సాయి బాబా కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సాన బోయిన మల్లికార్జున రావు, రాష్ట్ర కార్యదర్శి జక్కం శెట్టి బాలకృష్ణ, బండారు వెంకన్న బాబు, సిహెచ్ శంకర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.