శెట్టిబలిజ గౌడ వికాస విభాగ అధ్యక్షులుగా గుబ్బల మార్రాజు నియామకం

నరసాపురం: ఎల్ బి చర్ల గ్రామంలో ఇటీవల వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన గుబ్బల మార్రాజు వారి అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పాల్గొని వారిని సత్కరించి అనంతరం మార్రాజు ని నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ శెట్టిబలిజ గౌడ వికాస విభాగ అధ్యక్షులుగా మరియు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ సభ్యులుగా ప్రకటించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల వృత్తి చాలా ప్రమాదకరమైన వృత్తి, ప్రభుత్వం తక్షణమే కల్లు గీత కార్మికుల ఎక్స్ గ్రేషియా సంవత్సరానికి 10 వేలు ప్రకటించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి ఆకన చంద్రశేఖర్, వలవల నాని, బందెల రవీంద్ర, కటకంశెట్టి సంజీవరావు, గుత్తుల శ్రీనివాసరావు, దొంగ వెంకటపతి, వట్టిప్రోలు సతీష్, పొన్నమండ చింతరావు, తోట వెంకటేశ్వర్లు, తిరుమలశెట్టి రాజు, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.