స్మశాన కబ్జాని అడ్డుకొన్న జనసేన నాయకులు

కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో వైసీపీ ప్రభుత్వ నాయకులు అధికారుల అండదండలతో స్మశానాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తుఫాన్ ని కూడా లెక్క చేయకుండా జోరున కురుస్తున్న వర్షంలో సింగరాయకొండ మందలాధ్యక్షుడు ఐనాబత్తిన రాజేష్ అధ్వర్యంలో స్మశానం కబ్జాని ఎదుర్కొని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు, జనసైనికులు కాసుల శ్రీను, నాగరాజు, సాయి, సుభాని, కిరణ్ పాల్గొన్నారు.