పవనన్న ప్రజాబాట.. ప్రజల ఆదరణతో ముందుకెళ్తున్న రాజంపేట జనసేన

  • పవనన్న ప్రజా బాట 37వ రోజు

రాజంపేట: ప్రజల అపూర్వ ఆదరణతో నిర్విరామంగా కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 37వ రోజు.. రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరం పంచాయతీలో జరిగింది. కార్యక్రమంలో బాగంగా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉండే ప్రజలు జగన్ చేసే అరాచకాలకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాసి కార్యదర్శి రాటాల రామయ్య, వీర మహిళలు బండి లక్ష్మీదేవి, వనజ, సునీత, ప్రియాంక, లక్ష్మీదేవి, మల్లేశ్వరి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు పాల్గొనడం జరిగినది.