బోనకల్ జనసేన ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఫ్రూట్స్ పంపిణీ
- మధిర నియోజకవర్గాన్ని జనసేన అడ్డాగా మారుస్తాం
- మధిర గడ్డమీద జనసేన జెండాను ఎగురుతుంది
మధిర: బోనకల్ జనసేన పార్టీ మండల నాయకులు లక్కి శెట్టి సాయికుమార్ ఆధ్వర్యంలో బోనకల్ వృద్ధాశ్రమంలో ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా తాళ్లూరు డేవిడ్ తో పాటు లక్కీ శెట్టి సాయికుమార్ మాట్లాడుతూ.. మానవసేవే మాధవ సేవ అని మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలు మాకు నేర్పించారో అదేవిధంగా ప్రజా సమస్యల పైన పోరాడుతూ సమస్య ఎక్కడుందో అక్కడే మనం ఉండాలని ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడాలని మధిర నియోజకవర్గంలో జనసైనికులు గ్రామ గ్రామాన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ప్రకారంగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరెన్నో సేవాకార్యక్రమాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని, రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన పార్టీ కార్యక్రమాలు నిర్వహించి పార్టీ బలోపేతం కావడానికి మధిర నియోజకవర్గ జనసైనికులు అందరు సిద్ధంగా ఉన్నారని, 2024లో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడటమే మా ధ్యేయమని, మధిర నియోజకవర్గాన్ని జనసేన అడ్డాగా మారుస్తామని, మధిర గడ్డమీద జనసేన జెండాను ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ నాయకులు తాళ్లూరి డేవిడ్, నరసింశెట్టి నరేష్ మండల నాయకులు పవన్, అద్దంకి సంతోష్ కుమార్, మచ్చ మనోజ్, మోదుగు తరుణ్, మోదుగు చంటి, దుర్గాప్రసాద్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-15-at-8.09.46-PM-1024x461.jpeg)