అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా ఓటు అవగాహనా సదస్సు

  • అనుశ్రీ సమక్షంలో జనసేనలో చేరికలు

రాజమండ్రి సిటి, స్థానిక వీటి కాలేజ్ వద్ద జనసేన ఆధ్వర్యంలో ఓటు అవగాహన మరియు నమోదు సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ యువ నాయకులు బయ్యపు నీడి సూర్య ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అనేది చాలా విలువైనది ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విద్యార్థులకి సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో యువకులకి అనుశ్రీ చేతుల మీదుగా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ గెడ్డం నాగరాజు, ప్రధాన కార్యదర్శి పైడ్రాజు, నల్లంశెట్టి వీరబాబు , కార్యదర్శులు అల్లాటి రాజు, విన్న వాసు, గుణ్ణం శ్యాంసుందర్, కార్పొరేషన్ జాయింట్ సెక్రెటరీ దేవకివాడి చక్రపాణి, రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి ఏడిద బాబి, మరియు పల్లంటి సంజీవ్, విక్టరీ వాసు, మొండ్రేటి ప్రసాద్, మంచాల సునీల్, నర్సిపూడి రాంబాబు, హేమ దుర్గ మరియు సూర్య వారి మిత్రబృందం పాల్గొనడం జరిగింది.