ప్రజలకు మౌలిక వసతులు కల్పించండి.. జనసేన వినతిపత్రం

అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ శుక్రవారం జిల్లా చైర్ పర్సన్ సుభద్రను కలసి పెదబయలు మండలం ఆదివాసి గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కొరకై, ఆ పంచాయతీ యొక్క ప్రధాన సమస్యలైన మంచినీటి, డ్రైనేజ్, అరడకోట సెగ్మెంట్, బస్స్టాండ్, టూరిజం శాఖ పరిధి సమస్య, బొండారివాటర్ పాలు సమస్య , మొదలైన సమస్యలను.. అదేవిధంగా ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో రోడ్ సౌకర్యం, సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని, రోడ్ సౌకర్యం లేనందున ఈ మారుమూల ప్రాంతంలో అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఉండటం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి.. అలాగే మండల పరిస్థితిలో ఉన్నటువంటి అనేక విషయాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని వినతి పత్రము అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదబయలు మండలం అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్, మండల నాయకులు కళ్యాణ్ కుమార్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.